Friday, May 3, 2024

Breaking: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఇన్​ఫర్​మేషన్​తోనే రైడ్‌ చేశాం: సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్​ ఫామ్​హౌస్​లో భారీ ఆఫర్​ ఇచ్చి తమను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల ఇన్​ఫర్​మేషన్​తోనే రైడ్​ చేశామని సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ నేతలు పన్నిన వలను సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. ముగ్గురు బీజేపీ దూతలను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

తమను కొంతమంది ప్రలోభపెడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సమాచారం అందించారని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. డబ్బు, కాంట్రాక్టులు, ఇతర పదవులు ఇస్తామని ఆశచూపారని పేర్కొన్నారు. వారిచ్చిన సమాచారంతో ఫామ్‌ హౌజ్‌పై రైడ్‌ చేశామన్నారు. ఈ రైడ్‌లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరిలో ఢిల్లీ నుంచి వచ్చిన పీఠాధిపతి రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు. రామచంద్రభారతితో పాటు ఫామ్‌హౌజ్‌లో తిరుపతి నుంచి వచ్చిన సింహయాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ ఉన్నారని చెప్పారు. వీళ్లు ఏమని ప్రలోభ పెట్టారనే దానిపై విచారణ జరుపుతున్నామని.. వీరిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement