Saturday, May 4, 2024

ఢిల్లీ చేరుకున్న మిలింద్ సోమ‌న్-మోడీతో భేటీ

రీసెంట్ గా భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఝాన్సీ నుంచి ఢిల్లీ వరకు ఐక్యతా పరుగును జెండా ఊపి ప్రారంభించడమే కాకుండా, అందులో పాల్గొన్నారు ప్రముఖ నటుడు, నిర్మాత, ఫిట్ నెస్ ప్రేమికుడు మిలింద్ సోమన్. ఇందుకు సంబంధించి ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రధానిని కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ప్రధానితో భేటీ సందర్భంగా క్రీడలు, ఆరోగ్యం, ఫిట్ నెస్ కు సంబంధించి ప్రాచీన సంప్రదాయాల గురించి చర్చ జరిగినట్టు మిలింద్ సోమన్ వెల్లడించారు. యోగా, ఆయుర్వేదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ నెల 15న యూనిటీ రన్ మొదలు కాగా, 400 కిలోమీటర్లు పరుగెత్తి 22న సోమన్ ఢిల్లీ చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement