Thursday, May 2, 2024

వైరల్: కాకితో వ్యాపారం చేస్తున్న వ్యక్తి

కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ.. కాదేదీ కవితకు అనర్హం అన్న చందాన.. కరోనా కాలంలో కాదేది వ్యాపారానికి అనర్హం అన్నట్లు తయారైంది. కరోనా కష్టకాలంలో ఎవరూ దేన్నీ ఫ్రీగా చేయట్లేదు. ఆ మహమ్మారి వైరస్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారో ఏమో తెలియదు. కానీ… మాస్క్ దగ్గర నుంచి స్మశానానికి తరలించే దాకా ఒక్కో దానికి ఓక్కో రేటు ఉంది.

పోనీ స్మశానానికి వెళ్లిన తర్వాత పంచభూతాల్లో కలిసిపోదామనుకున్నా.. అంత ఈజీగా వదలరు మరికొందరు. స్మశానంలో ఖననానికి రేట్లు ఫిక్స్ చేస్తారు. టైమ్స్ బుక్ స్లాట్ బుక్ చేసుకోవాలంటారు. అసలే అయినవారు పోయి పుట్టెడు దుఖంలో ఉన్నా వైద్యానికి లక్షలు ఖర్చు పెట్టినా.. కట్టె కాలాలంటే కాసులు కుమ్మరించాల్సిందే. ఇవన్నీ ఓ ఎత్తు అయితే ఇప్పుడు మేము చెప్పబోయేది హైలెట్. ముందు మనం చెప్పుకున్న కాదేది వ్యాపారానికి అనర్షం అన్న పదానికి ఫర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది.

హిందూ సాంప్రదాయం ప్రకారం చనిపోయిన తర్వాత.. పిత్రు దేవతలకు పిండాలు పెట్టడం ఆనవాయితీ. అలా పెట్టిన పిండాలను కాకులు తింటే వారికి స్వర్గం ప్రాప్తిస్తుందని పురాణాల మాట. అయితే ప్రస్తుతం కాకుల జనాభా సంఖ్య తగ్గిపోవడం.. సిటీల్లో ఎక్కువగా లేకపోవడంతో ఓ వ్యక్తికి మంచి ఐడియా వచ్చింది. ఇంకేముంది వ్యాపారం పెట్టేశాడు.. స్మశానం టు స్వర్గానికి రూట్ చూపించాడు. అదును చూసి కాకి పిండం గేమ్ ఆడాడు. ఓ కాకిని పట్టుకొని దానికి కాస్త శిక్షణ ఇచ్చి వ్యాపారం మొదలెట్టేశాడు. స్వర్గ ద్వారాలను తెరిచే ఈ కాకి పిండం ముట్టుకోవాలంటే ఆయనకు రూ.100 ముట్టాల్సిందే. ఇలా రోజుకు మూడు శ్రార్థాలు, ఆరు పిండాల్లా వెలిగిపోతున్నాడు. ఈ వీడియో ఎక్కడిదో తెలియదు కానీ ఇలాంటి వ్యాపారం కూడా చేస్తారా అన్న సందేహం వస్తోంది.. మొత్తానికి ఆ కాకి మాత్రం తినలేక, తిన్నట్లు నటిస్తూ అల్లాడిపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement