Saturday, April 20, 2024

ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ విన్నపం

కొన్ని పరిస్థితుల దృష్ట్యా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా అభిమానులకు కొన్ని విషయాలను విన్నవించుకున్నారు. నా అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను . గత కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తి గా కోలుకుని, కోవిడ్ ను జయిస్తాను అని
ఆశిస్తున్నాను. ప్రతి ఏటా మీరు నా పుట్టిన రోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనం గా భావిస్తాను. కానీ ఈ సంవత్సరం మీరు ఇంటి పట్టునే ఉంటూ, లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ నియమాలను పాటిస్తూ జాగ్రత్త గా ఉంటారని ఆశిస్తున్నాను.

ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక.ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు. మన దేశం కరోనా తో యుద్ధం చేస్తోంది. కనిపించని శత్రువు తో అలుపెరుగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు మరియు ఇతర ఫ్రంట్ లైన్రియర్స్ కు మన సంఘీభావం తెలపాలి. ఎందరో తమ ప్రాణాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఆ కుటుంబాలకు కుదిరితే అండగా నిలబడాలి. మీ కుటుంబాన్ని జాగ్రత్త గా చూసుకోండి. మీరు జాగ్రత్త గా ఉండండి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, చేతనైన ఉపకారం చేయండి.
త్వరలో మన దేశం ఈ కరోనా ను జయిస్తుంది అని నమ్ముతున్నాను. ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందాం. అప్పటి వరకు, మాస్క్ ధరించండి. జాగ్రత్త గా ఉండండి. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూన్నాను అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement