Friday, May 3, 2024

బుర్జ్ ఖ‌లీఫా స్క్రీన్ పై విక్ర‌మ్ ట్రైల‌ర్ – ఆనందంలో క‌మ‌ల్ హాస‌న్ ఫ్యాన్స్

విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తోన్న తాజా చిత్రం విక్ర‌మ్..కాగా ఈ చిత్రం జూన్ 3న రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచంలో అత్యంత ఎత్తైన భ‌వ‌నం దుబాయ్ లోని బుర్జ్ ఖ‌లీఫా స్క్రీన్ పై విక్ర‌మ్ చిత్ర ట్రైల‌ర్ ని రిలీజ్ చేయ‌డం విశేషం..విక్రమ్’ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ ట్రైల‌ర్ రిలీజ్ కి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుర్జ్ ఖలీఫా స్క్రీన్ పై ప్రదర్శితమైన విక్రమ్ మూవీ సీన్లను.. కమల్ హాసన్ అక్కడే కూర్చొని తిలకించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వ్యాపారంలోనే దాదాపు రూ. 200 కోట్లను ఆర్జించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక సీన్ లో హీరో సూర్య కూడా కనిపించనున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement