Thursday, April 25, 2024

ఈట‌ల గెలుపు చారిత్రాత్మ‌కం..పూన‌మ్ కౌర్..

హుజూరాబాద్ బై పోల్ లో ఈటెల రాజేంద‌ర్ గెలుపు చారిత్రాత్మ‌క‌మ‌ని న‌టి పూన‌మ్ కౌర్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈట‌ల‌ని ప్ర‌త్యేకంగా క‌లిసింది. శాంతి కపోతమైన పావురాన్ని ఈటెల రాజేందర్‌తో కలిసి ఎగురవేసింది. అలా శాంతికి చిహ్నమైన తెల్లని దుస్తుల్లో కనిపించిన పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈటెల రాజేందర్‌ను ప్రత్యేకంగా కలిసిన పూనమ్ కౌర్.. గురునానక్ జయంతి సందర్భంగా ఏక్ ఓంకార్ అనే తన మతంలో పవిత్రమైన గుర్తును కానుకగా ఇచ్చింది. ధర్మ యుద్దం ఎప్పుడూ గెలుస్తుందంటూ ఈటెల రాజేందర్ విజయంపై స్పందించింది. ఈ పోస్ట్ తెగ వైర‌ల్ అవుతోంది.రైతు చట్టాలు రద్దు చేయడంతో మళ్లీ స్వేచ్చ, స్వతంత్ర్యం వచ్చినట్టు అనిపించింది. శాంతికి చిహ్నమైన పావురాలను ఇలా వదిలేద్దామని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది.

https://www.instagram.com/p/CWcrjL-gxtr/

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement