Sunday, May 5, 2024

కరోనాతో హీరోయిన్ మాలాశ్రీ భర్త కన్నుమూత

కరోనా మహమ్మారి సినీ పరిశ్రమను ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా పలువురు సినీ ప్రముఖులను కూడా ఈ బలి తీసుకుంటుంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటిలు కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోగా.. తాజాగా సీనియర్ హీరోయిన్ మాలా శ్రీ భర్త కుణిగల్ రాము కరోనాతో మరణించారు. గత మూడు రోజులుగా కరోనాతో పోరడుతున్న ఆయన సోమవారం సాయంత్రం కన్నుముశారు.

కన్నడ పరిశ్రమలో కోటిరాముగా పేరుతెచ్చుకున్న రాము… ఆయన కన్నడంలో అనేక హిట్ సినిమాలను నిర్మించారు. ఏకే 47, లాకప్ డెత్, కలాసిపాళ్యా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. గతవారం ఆయన కాస్త అనారోగ్యంగా ఉండడంతో.. కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అందులో పాజిటివ్ అని తెలింది. మూడు రోజుల క్రితం బెంగళూరులోని ఎం.ఎస్ .రామయ్య ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు చేస్తున్న చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదు. సోమవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

కాగా, మాలాశ్రీ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు పొందింది. కేవలం తెలుగు, కన్నడ, తమిళ భాషలలో కూడా టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమఖైదీతో ఆమె పరిచయమైంది. పరువు ప్రతిష్ట, తోడికోడళ్లు, బావమరిది, ఊర్మిళ, బంగారు మొగుడు, అల్లరి పోలీసు, ఆంధ్ర కిరణ్ బేడీ, సాహసవీరుడు సాగరకన్య లాంటి అనే హిట్ చిత్రాల్లో నటించింది. రాము మరణ వార్తతో కన్నడ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నారు. పలువురు సినీ ప్రముఖులు రాముకు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement