Friday, May 3, 2024

వేముల‌వాడ రాజ‌న్న‌కు నిలువెత్తు బెల్లం ..ఈట‌ల గెలుపు మొక్కు తీర్చుకున్న అభిమాని ..

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో కేసీఆర్ స‌ర్కార్ ని ధీటుగా ఎదుర్కొని బిజెపి జెండాని ఎగుర‌వేశారు ఈట‌ల రాజేంద‌ర్. దాంతో ఈట‌ల అభిమానులు మొక్కిన మొక్కుల‌ను ఒక్కొక్క‌టిగా తీర్చుకుంటున్నారు. కమలాపురం మండలం గూడూరు గ్రామానికి చెందిన ఈటల అనుచరుడు బండి వినయ్ సాగర్ వేములవాడ రాజన్నకు మొక్కు తీర్చుకున్నాడు. హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడి బిజెపి గెలిస్తే ఈటల నిలువెత్తు బంగారం సమర్పిస్తానని వినయ్ రాజరాజేశ్వస్వామిని మొక్కుకున్నాడు. తాజాగా ఈ మొక్కును తీర్చుకున్నాడు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈట‌ల రాజేంద‌ర్ ని కలిసిన వినయ్ ఆయన బరువుతో సరితూగే బెల్లాన్ని సేకరించాడు. ఈ మేర‌కు వేములవాడకు చేరుకున్న వినయ్ రాజన్నను దర్శించుకుని ఈటలతో సరితూగిన 56కిలోల బెల్లంను(నిలువెత్తు బంగారం) స్వామికి సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement