ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ విజయం సాధించింది. అయితే, ఉత్తరాఖండ్ లో మాత్రం బీజేపీకి మాత్రం షాక్ తగిలింది. రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓడిపోయారు. ఈ పరిణామం బీజేపీకి షాక్ తగిలేలా చేసింది. ఖతిమా నియోజవర్గం నుంచి పోటీ చేసిన పుష్కర్ సింగ్.. కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో 6 వేలకు పైగా ఓట్లతో ఓటమిపాలైయ్యారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో లీడ్ లో ఉన్న బీజేపీకి.. సిట్టింగ్ ముఖ్యమంత్రి ఓడిపోవడం నిరాశకు గురి చేసింది.
ఉత్తరాఖండ్ లో మొత్తం 70 స్థానాల్లో బీజేపీ48 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దాదాపుగా అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా పయనిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి హరీష్ రావత్ కూడా లాల్ కాన్ స్థానం నుంచి ఓడిపోయారు. ఒకే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల సీఎం అభ్యర్థులు ఓడిపోవడం గమనార్హం.
46 ఏళ్ల పుష్కర్ సింగ్ ధామీ గత సంవత్సరం తీరత్ సింగ్ రావత్ స్థానంలో సిఎంగా బాధ్యతలు స్వీకరించారు. తరువాత ఆరు నెలల గడువులోపు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కాలేకపోయారు.