Friday, April 26, 2024

అల్లూరి జ‌యంతి వేడుక‌ల‌కి – చంద్ర‌బాబుకి ఆహ్వానం ప‌లికిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి .. అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి వేడుక‌ల‌కి హాజ‌రుకావాల‌ని టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడికి ఆహ్వానం పంపారు. జూలై 4న భీమ‌వరంలో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125 జ‌యంతి వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి.అల్లూరి జ‌యంతి వేడుక‌ల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ హాజ‌ర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ జ‌యంతి వేడుక‌ల్లో భాగంగా భీమ‌వ‌రంలో అల్లూరి విగ్ర‌హాన్ని ప్ర‌ధాని ఆవిష్కరించ‌నున్నారు. అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నున్నఈ కార్యక్ర‌మానికి రావాలంటూ ఇప్ప‌టికే టాలీవుడ్ అగ్ర హీరో, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి కూడా కిష‌న్ రెడ్డి ఆహ్వానం ప‌లికిన సంగ‌తి తెలిసిందే. తాజాగా చంద్ర‌బాబునూ ఆహ్వానిస్తూ కిష‌న్ రెడ్డి ఆహ్వానం పంపడం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement