Monday, May 6, 2024

ఈట‌ల రాజేంద‌ర్ ఇంటికి వెళ్లిన – కేంద్ర హోం మంత్రి అమిత్ షా

బిజెపి ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ఇంటికి వెళ్లారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఇటీవలే ఈటల రాజేందర్ తండ్రి మృతి చెందారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివార్లలోని శామీర్ పేటలో ఉన్న ఈటల ఇంటికి వెళ్లి అమిత్ షా పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. మరోవైపు హైద‌రాబాద్ లో తెలంగాణ విమోచన దినోత్సవాల్లో అమిత్ షా పాల్గొన్న సంగతి తెలిసిందే. అనంతరం బీజేపీ కీలక నేతలతో సమావేశమై మునుగోడు ఉప ఎన్నికపై చర్చించారు అమిత్ షా.

Advertisement

తాజా వార్తలు

Advertisement