Saturday, May 18, 2024

ఒక్క ప‌క్క యుద్ధం – మ‌రో ప‌క్క వివాహం

ర‌ష్యా దాడుల‌తో ఉక్రెయిన్ నెత్తురోడుతోంది. యుద్ధ విమానాలు, ఫిరంగులు, బాంబుల మోత మ‌ధ్య ప్రార్థ‌నాల‌యంలో వివాహం చేసుకున్నారు. యుద్ధం నేపథ్యంలో రేపు ఏమి జరుగుతుందో ఊహించలేని పరిస్థితుల్లో తాము ఇప్పుడే పెళ్లి చేసుకున్నామని ఈ జంట తెలిపింది. అరీవా కీవ్ సిటీ కౌన్సిల్ లో డిప్యూటీగా పని చేస్తుండగా, ఫర్సిన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. 2019లో జరిగిన ఓ నిరసన కార్యక్రమం సందర్భంగా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. పెళ్లి జరిగిన తర్వాత అరీవా మాట్లాడుతూ.. ‘పరిస్థితి భయానకంగా ఉంది. కానీ ఇది మా జీవితంలో సంతోషకరమైన సమయం. యుద్ధం కారణంగా మేం ఎప్పుడైనా చనిపోవచ్చు. కానీ, ఆ లోగానే మేం ఒకటవ్వాలని కోరుకున్నాం’ అని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement