Saturday, May 11, 2024

Breaking: మహారాష్ట్రలో రేపు బలపరీక్ష.. ఫలించని ఉద్ధవ్​ ప్రయత్నాలు

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఫైనల్​ స్టేజ్​కి చేరుకుంది. వారం పది రోజులుగా ఎన్నో కీలక మలుపులు తీసుకున్న ఈ రాజకీయ వివాదం రేపటితో ముగియనున్నట్టు తెలుస్తోంది. గవర్నర్​ పిలుపు మేరకు రేపు శాసన సభలో సీఎం ఉద్ధవ్​ థాకరే బలపరీక్ష నిర్వహించుకోవాల్సి ఉండగా.. ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. కాగా, దీనిపై మూడున్నర గంటలపాటు వాదనలు కొనసాగినట్టు తెలుస్తోంది.. అయినా ఈ విషయంలో గవర్నర్​ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో రేపు అనగా 30వ తేదీన మహారష్ట్ర అసెంబ్లీలో సీఎం ఉద్ధవ్​ థాకరే బల పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే రెబల్​ ఎమ్మెల్యేలంతా కలిసి గోవాలో మకాం వేశారు. రేపు అసెంబ్లీ సమయానికల్లా వారు చేరుకునేలా రెబల్​ లీడర్​ ఏక్​నాథ్​ షిండే ప్లాన్​ చేసినట్టు సమాచారం

Advertisement

తాజా వార్తలు

Advertisement