Thursday, May 9, 2024

Kashmir : గ్రేనేడ్‌తో దాడిలో ఇద్దరు కార్మికులు మృతి

కశ్మీర్‌లోని సోఫియాన్‌ జిల్లాలో ఈరోజు జరిగిన గ్రేనేడ్‌ దాడిలో ఇద్దరు స్థానికేతర కార్మికులు మృతిచెందారు. కార్మికులు నివసిస్తున్న ప్రీ ఫాబ్రికేటెడ్‌ షెల్టర్‌పై మిలిటెంట్‌ గ్రేనేడ్‌తో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో యూపీలోని కనూజ్‌కు చెందిన మోనిష్‌ కుమార్‌, రామ్‌ సాగర్‌ ప్రాణాలు కోల్పోయారు. సోఫియాన్‌ జిల్లా ఆస్పత్రికి వాళ్లను తరలించారు. అయితే దాడి జరిగిన ప్రాంతాన్ని సీజ్‌ చేసి దాడికి పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.లష్కరే తోయిబా సంస్థకు చెందిన హైబ్రిడ్‌ మిలిటెంట్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement