Tuesday, May 21, 2024

మంత్రి సీదిరి అప్పలరాజుపై మరో ఫిర్యాదు

ఏపీలో కరోనాపై కొత్త రాజకీయం నడుస్తోంది. ఎన్‌-440కే వైరస్ వ్యవహారంపై టీడీపీ- వైసీపీ ప్రభుత్వం మధ్య వార్ రగులుతోంది. ఏపీ మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుపై కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. ఇటీవల ఓ టీవీ ఛానల్‌లో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అప్పలరాజు.. కర్నూలులో కరోనా కొత్తరకం మ్యుటెంట్‌ ఎన్‌-440కే వైరస్‌ విస్తరిస్తోందని అన్నారని న్యాయవాది జయన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి వ్యాఖ్యలతో ప్రజల్లో భయాందోళనకు గురవుతున్నారని, తక్షణమే మంత్రి పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు.

కాగా, ఇదే అంశంమై మంత్రి సీదిరి అప్పలరాజుపై కర్నూల్‌ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. కర్నూలులో కరోనా కొత్తరకం మ్యుటెంట్‌ ఎన్‌-440కే వైరస్‌ విస్తరిస్తోందని అన్నారని పోతురాజు రవికుమార్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement