Tuesday, May 7, 2024

Breaking: ఏనుగు దాడిలో ఇద్దరు మృతి

ఏనుగు దాడిలో ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ కాఫీ ఎస్టేట్​ కార్మికులపై ఏనుగు దాడి చేసింది. హసన్ జిల్లా జరిగిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మృతులను చిక్కయ్య(65), ఎర్రయ్య(68) గుర్తించారు. కడగెర్జీ గ్రామంలోని శారద ఎస్టేట్ కాఫీతోటలో జరిగిన ఈ విషాద ఘటనతో పనికి వెళ్లేందుకు కూలీలు భయపడుతున్నారు. వారం రోజులుగా గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగులు కనిపించడంతో ఏ క్షణం ఏం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అటవీశాఖపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement