Friday, May 17, 2024

ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ‘ఈశ్వ‌ర్ రావు’ కన్నుమూత‌

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వర్‌రావు అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. 63 ఏళ్ళ వయసులో ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటూ ఈయన మరణించారు. ఈశ్వర్ రావు ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీ కోదండపాణి కుమారుడు. తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సినిమాలకి ఈశ్వర్ రావు సంగీతం అందించారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ఎక్కువగా సంగీత సహకారం అందించారు. వీటితో పాటు అంతఃపురం,శుభలేఖ,జీవితం లాంటి పలు ఈటీవీ సీరియళ్లకు ఈయన మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈశ్వర్ రావు మరణంతో తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి.ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఈశ్వర్ రావ్ కు నివాళులు అర్పిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement