Saturday, May 18, 2024

ట్విట్టర్ తెలివైన వ్యక్తి చేతుల్లో ఉంది..పోస్ట్ పెట్టిన ట్రంప్

ట్విట్టర్ ఇప్పుడు తెలివైన వ్యక్తి చేతుల్లో ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. కాగా
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు. 44 బిలియన్ యూఎస్ డాలర్లతో ఈ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ను తన చేతుల్లోకి తీసుకున్నారు. . ట్విట్టర్‌ను మస్క్‌ హస్తగతం చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ట్రంప్. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా పోస్టు పెట్టారు. అమెరికాను ద్వేషించే ర్యాడికల్‌ లెఫ్ట్‌ ఉన్మాదుల నిర్వహణ నుంచి ట్విట్టర్ బయటకు వచ్చింది. ఈ విషయాలపై చాలా సంతోషంగా ఉంది. సంస్థను తీవ్రంగా దెబ్బతీసిన నకిలీ ఖాతాలు, ఇతరత్రా కార్యకలాపాలను వదిలించుకోవడానికి ట్విట్టర్‌ కృషి చేయాలన్నారు. అయితే, ఆయన ట్విట్టర్‌లోకి తిరిగి వస్తారో లేదో మాత్రం వెల్లడించలేదు. 2021 జనవరిలో అగ్రరాజ్యంలోని క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడి పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌పై ట్విట్టర్‌ శాశ్వతంగా నిషేధం విధించింది. రానున్న రోజుల్లో మస్క్ ట్రంప్ పై నిషేధాన్ని ఎత్తివేస్తారో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement