Sunday, May 19, 2024

మంత్రి కుమారై కిడ్నాప్ కేసులో ట్విస్ట్ – డ్రైవ‌ర్ ని ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న జ‌య‌క‌ళ్యాణి

త‌మిళ‌నాడు మంత్రి శేఖ‌ర్ బాబు కుమారై డాక్ట‌ర్ జ‌య‌క‌ళ్యాణి ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నారు. బెంగ‌ళూరులోని ఓ హిందూధార్మిక సంస్థ‌లో స‌తీష్ ను ఆమె పెళ్లి చేసుకున్న‌ట్లు స‌మాచారం. కాగా ఆరు సంవ‌త్స‌రాలుగా తాము ప్రేమించుకున్నామని, పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఈ పని చేశామని జ‌య‌క‌ళ్యాణి తెలిపింది. అయితే తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఈ కొత్త జంట.. బెంగళూరు సిటీ కమిషనర్ కమల పంత్ ను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించారని కోరారు. ఇది ఇలా ఉండ‌గా ..కూతురు కనిపించకుండా పోయేసరికి మంత్రి శేఖర్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశార‌ని తెలిపారు. దీంతో మంత్రి కూతురి కిడ్నాప్ మీడియాలో హైలెట్ అయింది. ఇంకోపక్క పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. ఈలోపు పక్క రాష్ట్రంలో పోలీసుల ముందు ప్రత్యక్షమై ట్విస్ట్ ఇచ్చింది జయకళ్యాణి. సతీష్ ఆ ఇంటి డ్రైవర్. పైగా దళితుడు. కొన్ని నెలల క్రితం కళ్యాణ్ ని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రి మంత్రి శేఖర్ ను అడిగాడు.డ్రైవర్, పైగా కులాంతర వివాహం కావడంతో మంత్రి ఒప్పుకోలేదు. పైగా సతీష్ ను రెండు నెలల పాటు తమిళనాడు పోలీసుల సహాయంతో అక్రమంగా నిర్బంధించాడు కూడా.. ఇందుకు సంబంధించి గతంలో చేసిన ఓ వీడియో మీడియాలో వైరల్ అయింది. అయితే ఇప్పుడు తాము మేజర్లు అయినందున పెళ్లి చేసుకున్నామని తెలిపింది కళ్యాణి.. తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని తమ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని, కాబట్టి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు ఆమె మీడియా ముందు పోలీసులను వేడుకుంటుంది. తమిళనాడు హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ మినిస్టర్ అయిన శేఖర్ బాబు.. సీఎం స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడు కూడా.

Advertisement

తాజా వార్తలు

Advertisement