Tuesday, April 30, 2024

శ్రీవారి భక్తులకు గమనిక.. ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక. ప‌ద్మావ‌తి  పరిణయోత్సవాలు సంద‌ర్భంగా  మే 10 నుండి 12వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు మే 10 నుండి 12వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడురోజులపాటు జరుగనున్న ఈ వేడుకలో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement