Monday, April 29, 2024

TS వైద్యం చేయ‌రు..పాఠాలు చెప్ప‌రు.. 112 మంది డాక్ట‌ర్ల‌పై యాక్ష‌న్‌కు రెడీ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 112 మంది డాక్ట‌ర్ల‌పై వేటు వేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నెలల కాలంగా డుమ్మా కొడుతున్న డాక్ట‌ర్ల‌ లిస్ట్‌ను వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది. ఉద్యోగాల్లో ఉండి.. కాలేజీలకు రాకుండా, విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఉన్న డాక్టర్లను విధుల నుంచి తొలిగించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

అనుబంధం ఆస్ప‌త్రుల్లో తీవ్ర ఆటంకాలు..

వైద్యుల గైర్హాజరు కారణంగా అటు వైద్యవిద్యార్థులకు తరగతులు జరగకపోగా . ఇటు అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. టీచింగ్ హాస్పిటల్స్ కావడంతో రోగులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. దవాఖానల్లో ఓపీ తక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో విధుల‌కు డుమ్మా కొట్టిన 112 మంది వైద్యులను గుర్తించి నోటీసులు జారీ చేశారు. వారిని సర్వీస్ నుంచి టర్మినేట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వారి స్థానంలో కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ వేసేందుకు కూడా అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement