Monday, April 29, 2024

TS టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లోనూ అమ్మాయిల హవానే కొనసాగింది. సప్లిమెంటరీ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన విడుదల చేశారు. మొత్తం 79.82 శాతం మంది ఉత్తీర్ణులవగా, వారిలో 78.42 శాతం మంది బాలురు, 82.21 శాతం మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 1 నుంచి 10 వరకు నిర్వహించారు. వీటికోసం 55,663 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 48,167 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 38,447 మంది ఉత్తీర్ణత సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement