Thursday, May 2, 2024

కంటైనర్​ లారీలో డ్రగ్స్​ సప్లయ్​.. 102 కిలోల నల్లమందు స్వాధీనం చేసుకున్న అధికారులు

ఈశాన్య రాష్ట్రం నుంచి రాజస్థాన్​కు కంటైనర్​ లారీలో పెద్ద ఎత్తున డ్రగ్స్​ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నల్లమందు పెద్దమొత్తంలో సప్లయ్​ అవుతుందన్న సమాచారం మేరకు పోలీసులు, సెంట్రల్​ బ్యూరో ఆఫ్​ నార్కోట్రిక్స్​ బృందం నిఘాపెట్టింది. లారీ ఆచూకీ కనుగొని ఆపేందుకు యత్నించగా.. పోలీసుల ఎస్కార్ట్​ వాహనంపై నుంచి లారీని ఎక్కించి పారిపోయేందుకు డ్రైవర్​ యత్నించాడు. ఛేజ్​ చేసి మరీ లారీనీ పట్టుకుని 102 కిలోల నల్లమందు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఓ కంటైనర్ లారీలో డ్రగ్స్​ సప్లయ్​ చేస్తుండగా రాజస్థాన్​లో సెంట్రల్​ బ్యూరో ఆఫ్​ నార్కోటిక్స్​ టీమ్​ చాకచక్యంగా పట్టుకుంది. జైపూర్-ఆగ్రా హైవేపై రాజధోక్ టోల్ ప్లాజా వద్ద లారీని ఛేజ్​ చేసి మరి 102.910 కిలోల బరువున్న 95 నల్లమందు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ట్రక్కును సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (CBN), నీముచ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈశాన్య ప్రాంతం నుంచి రాజస్థాన్‌కు అశోక్ లేలాండ్ ట్రక్​లో పెద్ద మొత్తంలో నల్లమందు తరలిస్తున్నట్టు ముందస్తుగా అధికారులకు సమాచారం అందింది. ఈ పక్కా సమాచారం మేరకు వాహనం వస్తున్న దారిలో నిఘా బృందాలను ఏర్పాటు చేశారు.

అయితే.. పోలీసులు, నార్కోటిక్స్​ బృందం ట్రక్కును చూసి పక్కకు ఆపాలని కోరారు. పోలీసులను చూసిన లారీ డ్రైవర్​ వారి వాహనంపైనుంచి లారీని ఎక్కించేందుకు డ్రైవర్​ యత్నించాడు. అయితే ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ట్రాలర్ లోపల ప్రత్యేకంగా నిర్మించిన కేబిన్​లో నల్లమందు దాచినట్లు గుర్తించారు.

సెంట్రల్​ బ్యూరో ఆఫ్​ నార్కోటిక్స్​  కార్యాలయానికి చేరుకున్న తర్వాత ట్రాలర్‌ను క్షుణ్ణంగా శోధించారు. ట్రాలర్ లోపల ప్రత్యేకంగా నిర్మించిన ఓ కేబినెట్​లో 102.910 కిలోల బరువున్న 95 నల్లమందు ప్యాకెట్లును పోలీసులు గుర్తించారు. ఎన్‌డిపిఎస్ చట్టం, 1985 నిబంధనల ప్రకారం డ్రగ్‌తో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement