పంచఖేరో డ్యామ్ ని సందర్శించడానికి రాజ్ ధన్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటోన్న కుటుంబం వచ్చింది. ఈ డ్యామ్ లో వారు ప్రయాణిస్తున్న సమయంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటన నుండి ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి సురక్షితంగా బయట పడ్డాడు. ఈ ఘటనలో ప్రదీప్ సింగ్ కు చెందిన 17 ఏళ్ల కొడుకు శివమ్ సింగ్ , 14 ఏళ్ల పాలక్ కుమారిలు చనిపోయారు.
అంతేకాదు 40 ఏళ్ల సీతారాం యాదవ్, అతని ముగ్గురు పిల్లలు కూడా చనిపోయారు. 16 ఏళ్ల ఫెజల్ కుమారి, 8 ఏళ్ల హర్షల్ కుమార్, 5 ఏళ్ల బావువా, 16 ఏళ్ల రాహుల్ కుమార్, 14 ఏళ్ల అమిత్ కుమార్ మరణించారు. బోటు డ్యామ్ మధ్యలోకి రాగానే మునిగిపోయిందని ఈ ఘటన నుండి బయట పడిన ప్రదీప్ కుమార్ చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున డ్యామ్ వద్దకు చేరుకున్నారు. ఈ విషయమై సమాచారం అందుకున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణదేవి కొడెర్మా కు చెందిన అధికారులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.జార్ఖండ్ రాష్ట్రంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
విషాదంగా విహారయాత్ర-పడవ మునిగి ఒకే కుటుంబానికి చెందిన 8మంది మృతి
Advertisement
తాజా వార్తలు
Advertisement