Wednesday, May 1, 2024

హ‌ర్యానాలో విషాదం… ఒకే ఇంట్లో ఆరుగురు అనుమానాస్ప‌ద మృతి

హ‌ర్యానా రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్య‌క్తులు అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందిన విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. అంబాలాలోని బ‌లానా గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మృతిచెందిన వారిలో సంగ‌త్ రామ్‌, భార్య మ‌హింద‌ర్ కౌర్‌, కుమారుడు సుఖ్వింద‌ర్ సింగ్‌, సుఖ్వింద‌ర్ భార్య రినా, వాళ్లు పిల్ల‌లు అషు, జాసిలు ఉన్నారు. సుఖ్వింద‌ర్ త‌న కుటుంబ స‌భ్యుల‌కు విషం ఇచ్చి ఆ త‌ర్వాత అత‌ను ఉరి వేసుకున్న‌ట్లు అనుమానిస్తున్నారు. సుఖ్వింద‌ర్ ఓ ప్రైవేటు కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. పోస్టుమార్ట‌మ్ కోసం మృత‌దేహాల‌ను అంబాలా సిటీ సివిల్ ఆస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. పోస్టుమార్టం రిపోర్టు వ‌స్తే.. వారు ఎలా చ‌నిపోయార‌న్న‌ది తెలిసే అవ‌కాశ‌ముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement