Saturday, April 27, 2024

చంచల్‌గూడ జైలుకి వెళ్లిన టీ.పీసీసీ బృందం

చంచల్‌గూడ జైలుకు కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. నిన్న NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌తో పాటు 17 మందిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరించడంతో NSUI నేతలు నిరసన తెలిపారు. ఓయూలో వీసీ ఛాంబర్ ముందు ఆందోళనతో అరెస్ట్ చేశారు. బలమురి వెంకట్ సహా 17 మంది ని చంచల్ గుడా జైలు కి రిమాండ్ చేశారు.. NSUI నేతలను ములాఖత్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్స్ గీతారెడ్డి, తూర్పు జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఫిరోజ్ ఖాన్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు కలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement