Monday, April 29, 2024

Onlilne Movie Tickets: మంత్రి పేర్ని నానిని కలిసిన నిర్మాతలు.. ఏం మాట్లాడారు?

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చట్టానికి ఏపీ కేబినెట్ గురువారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ సచివాలయంలో మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ప్రతిపాదనలను ఆమోదించిన నేపథ్యంలో నిర్మాతలు వచ్చి మంత్రిని కలవడం చర్చనీయాంశమైంది. 

మంత్రి పేర్ని నానిని నిర్మాతలు దిల్‌ రాజు, అలంకార్‌ ప్రసాద్‌ ఇతర నిర్మాతలు కలిసి పలు విషయాలపై మాట్లాడారు. సినీ రంగానికి సంబంధించిన పలు సమస్యలు, సినిమాటోగ్రఫీ చట్టం సవరణ, ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి సంబంధించి కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ నిర్మాతలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిగింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో నాగర్జున.. గురువారం సీఎం జగన్ తో భేటీ అయి మాట్లాడారు. ఆయన సీఎం జగన్‌ను కలిసిన అనంతరం .. తాజాగా సినీ నిర్మాతలు మంత్రి పేర్ని నానితో భేటీ కావడం ప్రధాన్యం సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: పునీత్ రాజ్ కుమార్ మృతి.. షాక్ లో సినీ ప్రముఖులు

Advertisement

తాజా వార్తలు

Advertisement