Thursday, May 2, 2024

శ్రీవారి ద‌ర్శ‌నానికి పోటెత్తుతోన్న భ‌క్తులు – నిండిన క్యూ లైన్లు

తెలుగు రాష్ట్రాల్లో 98శాతానికి పైగా వ్యాక్సినేష‌న్ పూర్త‌యింది. దాంతో క‌లియుగ‌దైవం తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునే నిమిత్తం భ‌క్తులు పోటెత్తుతున్నారు. వారాంతం నేప‌థ్యంలో శ‌నివారం భారీ సంఖ్య‌లో భ‌క్తులు తిరుమ‌ల చేరుకున్నారు. దీంతో దాదాపుగా రెండేళ్ల త‌ర్వాత స‌ర్వ ద‌ర్శ‌నం క్యూ లైన్లు నిండిపోయాయి. ప‌రిస్థితిని అంచ‌నా వేసిన టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి క్యూ లైన్ల‌తో పాటు భ‌క్తుల వ‌స‌తి స‌ముదాయాల‌ను త‌నిఖీ చేశారు. క్యూ లైన్ల‌లోని భ‌క్తుల‌కు ఎలాంటి అసౌకర్యం క‌ల‌గ‌కుండా పాలు, ఆహారం అందించాల‌ని ఆయ‌న అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement