Monday, April 29, 2024

Breaking: టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ లో ముగ్గురు సస్పెండ్

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉదయం టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూరులో ఈరోజు పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ లో ప్రత్యక్షమైంది. టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో అధికారులు చర్యలు తీసుకున్నారు. ముగ్గురు విద్యాశాఖ ఉద్యోగుల పై సస్పెన్షన్ వేటు వేశారు. పరీక్ష సెంటర్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్ తో పాటు మరొకరిపై వేటు పడింది. ప్రభుత్వ టీచర్ బందెప్ప వాట్సాప్ పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement