Friday, April 26, 2024

Karimnagar | గొంతుకోసి యువకుడిని దారుణంగా చంపేశారు. క‌రీంన‌గ‌ర్‌లో ఘ‌ట‌న‌

కరీంనగర్ జిల్లాలో దారుణం జ‌రిగింది. నగరంలోని విద్యానగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో పి టి సి రోడ్డు లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పురంశెట్టి నరేందర్ అనే వ్యక్తిని గురుతెలియబి వ్యక్తులు గొంతు కోసి చంపేశారు. ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఈ సంఘటన జరిగింది. నరేందర్ తో పాటు మరికొందరు కలసి ఆ ప్రాంతంలో మద్యం సేవించినట్లు ఆనవాళ్లు లభించాయి. నరేందర్ తో కలసి మద్యం తాగిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ కలహాలు ఘటనకు కారణంగా తెలుస్తోంది. సంతోష్‌న‌గ‌ర్‌లో నివాసం ఉండే న‌రేంద‌ర్, కొద్దీ రోజులు ఆస్ట్రేలియాలో ఉండి వచ్చాడు. టౌన్ ఏ సి పి తుల శ్రీనివాస్ రావు, టూ టౌన్ సి ఇ లక్ష్మిబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement