Friday, April 19, 2024

Telangana | సీఎం కేసీఆర్​ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి.. పర్యవేక్షించిన కలెక్టర్, సీపీ

ముఖ్యమంత్రి కేసీఆర్​ కరీంనగర్ జిల్లా పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రీ పంప్ హౌస్ వద్ద హెలిప్యాడ్ ను కలెక్టర్ ఆర్వి కర్ణన్, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు పరిశీలించారు. వడగళ్ల వానతో రామడుగు మండలంలో దెబ్బతిన్న పంట పొలాలను గురువారం సీఎం కేసీఆర్​ స్వయంగా పరిశీలించనున్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణలో అడిషనల్ డీసిపీ చంద్రమోహన్, కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు, సీఐ రవితోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement