Saturday, April 20, 2024

AP | విజయవాడ రైల్వే స్టేషన్‌లో క‌స్ట‌మ్స్ సోదాలు.. రూ.7.48 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

విజయవాడ రైల్వే స్టేషన్‌లో పెద్ద ఎత్తున బంగారం స్వాధీని చేసుకున్నారు. క‌స్ట‌మ్స్ అధికారుల త‌నిఖీల్లో దాదాపు ఏడున్నర కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. తమిళనాడు నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు పెద్ద ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు ప‌క్కా సమాచారం అందిన‌ట్టు తెలుస్తోంది.

దీంతో.. పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద కాపు కాశారు. ఈ సందర్భంగా అనుమానాస్పందగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా 5 కిలోల‌ బంగారం లభించింది. అనంతరం వారిని ప్రశ్నించగా మరికొందరి సమాచారం లభించింది. దీంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మొత్తంగా 12.97 కిలోల బంగారాన్ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 7.48 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచ‌నా వేశారు. పట్టుబడిన బంగారంలో కొంత బిస్కెట్ల రూపంలో ఉండగా, మరికొంత ఆభరణాల రూపంలో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement