Tuesday, May 21, 2024

కేంద్రంతో రాష్ట్రం క‌లిసి రావ‌డం లేదు… మోడీ

కేంద్రంతో రాష్ట్రం క‌లిసి రావ‌డం లేద‌ని, రాష్ట్ర ప్రభుత్వం వల్లే అభివృద్ధి ప‌నుల్లో ఆల‌స్య‌మ‌వుతుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్ లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం రాలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అభివృద్ధి పనుల్లో కేంద్రంతో రాష్ట్రప్రభుత్వం కలిసి రావట్లేదని వ్యాఖ్యానించారు. కేంద్రం అభివృద్ధి పనులు చేపడుతుంటే రాష్ట్రప్రభుత్వం బాధపడుతోందని మండిపడ్డారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకోవ‌ద్ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాన‌న్నారు.

కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదని మోడీ స్పష్టం చేశారు. ప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు. నేరుగా రైతులు, విద్యార్థుల ఖాతాల్లో నిధులు వేస్తున్నామని తెలిపారు. డిజిటల్‌ విధానం ద్వారా దళారీవిధానం లేకుండా చేశామన్న ప్రధాని.. అవినీతిపరులకు నిజాయితీతో పనిచేసే వారంటే భయమని అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement