Tuesday, April 30, 2024

Breaking: డిగ్రీ ప్రేవేశ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల‌.. అభినందించిన మంత్రి కొప్పుల‌

ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీలలో ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశపరీక్ష ఫలితాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవ్వాల కొద్దిసేప‌టి క్రిత‌మే రిలీజ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీలు 30, ఎస్టీ మహిళా డిగ్రీ కాలేజీలు 15, ఎస్టీ బాలుర డిగ్రీ కాలేజీలు 7 కాగా, మొత్తం 52 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రవేశాల కోసం ఇటీవల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ( TGUGCET- 2022) నిర్వహించారు. ఈ ఫలితాలను మంత్రి కొప్పులఈశ్వర్ తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షకు 18,498 మంది హాజర‌య్యార‌ని తెలిపారు.

ఇందులో అర్చన అనే అమ్మాయి మొదటి ర్యాంకు సాధించారు. పరీక్షలో అర్చనతో పాటు ఉత్తీర్ణత సాధించిన వారందరిని మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ అభినందించారు. ఎస్సీ గురుకులాలకు సంబంధించిన ఫలితాలు, www.tswreis.ac.in, ఎస్టీ గురుకులాలకు సంబంధించిన ఫలితాలను https://tgtwgurukulam.Telangana.gov.in వెబ్ సైట్స్ ద్వారా పొందవచ్చని తెలిపారు. కార్య‌క్ర‌మంలో అధికారులు హన్మంతు నాయక్, ఎం.ప్రవీణ్, ప్రమోద్ కుమార్, శర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement