Monday, May 20, 2024

బ‌డికి వెళ్లిన ప‌దో త‌ర‌గ‌తి అమ్మాయిలు తిరిగి రాలేదు.. చెరువు గట్టుపై స్కూల్ బ్యాగ్స్..

హైదరాబాద్ ​లో ఇద్దరు బాలికలు మిస్సింగ్ అయిన విష‌యం అంద‌రిలో క‌ల‌క‌లం రేపుతోంది. శనివారం ఉదయం స్కూల్ కు వెళ్లిన ఇద్దరు బాలికలు తిరిగి ఇంటికి చేర‌లేదు. ఈ ఘటనలో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్​లోని జీడిమెట్ల పరిధిలోని సూరారం కాలనీకి చెందిన మౌనిక, గాయత్రి స్థానికంగా ఉండే స్కూల్ లో పదో తరగతి​చదువుతున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి స్కూల్‌కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో వారి కుటుంబ స‌భ్యులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ ల‌భించ‌లేదు. ఈ క్రమంలో వారిద్దరి స్కూల్ బ్యాగ్స్ సమీపంలోని సూరారం చెరువుగట్టుపై క‌నిపించాయి.ఈ విషయంపై బాలికల తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.

కాగా, ఇటీవల హైదరాబాద్​లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల రేష్మా, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని చిన్నకోడూరుకి చెందిన 17 ఏళ్ల శ్రావణి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజ్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. ఏడాదిగా దూరంగా ఉంటున్న ఈ ఇద్దరూ అప్పుడప్పుడూ కలుసుకుంటున్నారు. అయితే ఆరోగ్యం బాగోలేదని చెప్పి కాలేజీ నుంచి వచ్చేసిన శ్రావణి.. హాస్టల్‌ నుంచి బయటికి వచ్చి చౌటుప్పల్ వెళ్లింది. ఆ తర్వాత నల్గొండలో ఉంటున్న రేష్మా కూడా ఇంట్లో సూసైడ్ నోట్ రాసిపెట్టి బయటికి వెళ్లింది. ఇద్దరూ కలిసి పానగల్‌లోని ఉదయసముద్రం జలాశయానికి చేరుకున్నారు. ఉదయసముద్రం దగ్గర రెండు చున్నీలు, ఓ బ్యాగు పెట్టి వెళ్లారు. రేష్మా ఓ సూసైడ్ నోట్ రాసి బ్యాగులో పెట్టింది. వారిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement