Thursday, May 2, 2024

నాలుగవ రోజు లాభాలతో ముగిసిన.. స్టాక్ మార్కెట్లు

నాలుగవ రోజు లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. నేడు ట్రేడింగ్ ను సానుకూలంగా ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు లాభాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ మన మార్కెట్లు లాభాలను నమోదు చేయడం గమనార్హం. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 583 పాయింట్లు లాభపడి 59,689కి పెరిగింది. నిఫ్టీ 159 పాయింట్లు పుంజుకుని 17,557కి ఎగబాకింది. ఎల్ అండ్ టీ (3.96%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.97%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.72%), సన్ ఫార్మా (1.93%), ఐటీసీ (1.93%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.26%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.24%), ఎన్టీపీసీ (-1.01%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.73%), మారుతి (-0.57%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement