Wednesday, May 1, 2024

ఒక్క ఉప ఎన్నిక కోసం ప్రభుత్వమంతా వచ్చింది.. మోడీ

ఒక్క ఉప ఎన్నిక కోసం ప్రభుత్వమంతా తరలివచ్చిందని మునుగోడు ఉప ఎన్నిక గురించి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.  హైదరాబాద్ లోని బేగంపేట లో నిర్వహించిన సభలో మోడీ మాట్లాడుతూ… మునుగోడు బైపోల్ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలంతా తరలివచ్చారన్నారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తల పనితీరు తనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై బీజేపీ కార్యకర్తలు గట్టిగానే పోరాడుతున్నారన్నారు. రాజకీయాలనేవి సేవాభావంతో ఉండాలన్నారు. కానీ ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్లు మోడీని తిట్టడం, బీజేపీని తులనాడటమే పనిగా పెట్టుకున్నారన్నారు. తనను తిడుతున్న వారిని అస్సలు పట్టించుకోవద్దన్నారు. సాయంత్రం టీ తాగుతూ ఆ తిట్లను ఎంజాయ్ చేయండని అన్నారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అలాగే దోచుకున్న వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement