Friday, April 19, 2024

తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనేందుకు రావడం సంతోషకరం.. మోడీ

తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనేందుకు రావడం సంతోషకరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హైదరాబాద్ లోని బేగంపేట లో నిర్వహించిన సభలో మోడీ మాట్లాడుతూ… బీజేపీ కార్యకర్తలు ఎవరికీ భయపడకుండా పోరాటం చేస్తున్నారన్నారు. తెలంగాణ పేరు చెప్పి పార్టీలు పెట్టిన వారు పదవులు అనుభవిస్తున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నారన్నారు. తెలంగాణలో కమలం వికసించే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement