Thursday, May 2, 2024

రైల్వేస్టేషన్ లో పాడయిన ట్యాప్..ట్రైన్ తో పాటు తడిసిన ప్రయాణికులు..వైరల్ గా వీడియో

ఒక్కోసారి ఒక్కో సంఘటనలు భలేగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే ఓ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ లోని రైల్వే స్టేషన్ లో ఒక ట్యాప్ పాడయింది… దాని నుంచి వచ్చే నీరు.. షవర్ లా అందరినీ తడిపేసింది. ప్లాట్ ఫామ్ పై వెళ్తున్న రైలు, రైల్లోని ప్రయాణికులను కూడా తడిపేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని ‘ ఇండియన్ రైల్వే ఎట్ యువర్ సర్వీస్’ అనే క్యాప్షన్ తో షేర్ చేయడం గమనార్హం. ఈ వీడియోకి 1.1 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా… 26,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.ఈ వీడియో 30-సెకన్లు ఉండగా… ఫుటేజీలో, పగిలిన కుళాయి నుండి నీరు ఫిరంగిలాగా పూర్తి శక్తితో బయటకు రావడం కనపడుతోంది. కొద్దిసేపటి తర్వాత, కెమెరా ఇన్‌కమింగ్ రైలు వైపు ప్యాన్ చేయడంతో, ప్రయాణిస్తున్న లోకల్ ట్రైన్ డోర్ దగ్గర నిలబడి ఉన్న ప్రయాణికులు ఆ నీటిలో తడిశారు. నీళ్లు మీద పడగానే వెంటనే లోపలికి పరిగెత్తిన వారు కూడా ఉన్నారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో పాటు…. కామెంట్ల వర్షం కురుస్తోంది. కామెంట్లు చూస్తే మరింతగా నవ్వుకుంటారు. కులాయ్ కి కోపం వచ్చిందని…. ఆ కోపం నుంచి ప్రయాణికులు కూడా తప్పించుకోలేకపోయారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరేమో.. ఇది రైల్వే అందించిన స్పెషల్ సేవ అని వెటకారంగా రాశారు. మరొకరు.. ప్రయాణికులు చాలా మంది ఉదయాన్నే స్నానం చేయరని.. ఇలా ప్లాన్ చేశారంటూ కామెంట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement