Sunday, April 28, 2024

ఉక్రెయిన్ లో భార‌తీయ బాధితుల‌కు ‘సోనూసూద్’ సాయం

ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధం వ‌ల్ల ఉక్రెయిన్ లో చిక్కుకున్న భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకురావ‌డానికి కేంద్ర స‌ర్కారు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నా..ప‌లువురు బాధితులు మాత్రం సోనూసూద్ ని స్మ‌రించుకుంటున్నారు. సోనూసూద్ సాయం కోసం సామాజిక మాధ్యమాల సాయంతో ఆయనకు వినతులు పంపుతూనే ఉన్నారు. దాంతో స్పందించిన‌సోనూసూద్ త‌న‌కు చెందిన చారిటీ సంస్థ నుంచి తమకు సాయం అందడం పట్ల అక్కడి భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. సహాయక కార్యక్రమాలకు సంబంధించి సోనూసూద్ కూడా తన ట్విట్టర్ పేజీలో తాజా వివరాలను ఉంచుతున్నారు. ‘‘ఇది నా బాధ్యత. నా వంతుగా సాయం చేయగలిగినందుకు సంతోషిస్తున్నాను’’అంటూ సోనూ స్పందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement