ఉద్యోగస్తులకి యజమానులు పలు సూచనలు చేయడం, హెచ్చరించడంలాంటివి ప్రతీ కంపెనీలో జరుగుతుంటాయి. ఏదో ఒక విషయంలో చిన్న చిన్న తగాదాలు వస్తుంటాయి. అయితే ఆ ఉద్యోగం నచ్చితే చేయాలి లేదంటే వేరే ఉద్యోగం చూసుకోవాలి. కానీ ఓ మహిళా ఉద్యోగి బాస్ తిట్టాడని కక్ష పెంచుకుని ఏకంగా ఆ కంపెనీనే తగుల పెట్టింది. ఈ సంఘటన థాయిలాండ్ లో చోటు చేసుకుంది. థాయిలాండ్ లోని ప్రప్పాకార్న్ ఆయిల్ వేర్ హౌస్ లో పనిచేస్తుంది అన్న్ శ్రీయా అనే యువతి. ఇటీవలే బాస్ తో గొడవ జరిగింది. దాంతో బాస్ పై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని అనుకుంది సదరు మహిళ. బాస్ మీద కోపంతో చిన్న పేపర్ కు నిప్పు అంటించి ఆయిల్ కంటైనర్ల పైకి విసిరింది.
దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. వేర్ హౌస్ మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. గమనించిన ఉద్యోగులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. దీంతో చూస్తుండగానే గంటల వ్యవధిలో ఆయిల్ వేర్ హౌస్ మొత్తం అగ్నికి ఆహుతి అయింది. దీంతో సంస్థకు ఏకంగా రూ. 9.07 కోట్ల నష్టం వాటిల్లింది. దాంతో ఆ మహిళ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..