Friday, April 26, 2024

Breaking: ఎర్రవల్లిలో రేవంత్ ‘రచ్చబండ’.. ఇంటి వద్ద పోలీసులు పహారా


టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఈ రోజు గజ్వెల్ నియోజకవర్గంలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో వరి పంటలు వేసిన అంశాన్ని మీడియాకు చూపిస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో అర్థరాత్రి నుంచే రేవంత్ రెడ్డి ఇంటి ముందు పోలీసుల పహారా కాస్తున్నారు.

రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్‌లు, అరెస్ట్‌లు చేస్తున్నారు. దుబ్బాకలో ఆరు గురు, భూంపల్లి పోలీసు స్టేషన్‌లో ఐదు గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాము ఈ కార్యక్రమం నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement