Friday, May 10, 2024

టెంపో ట్రాలీ లోయలో పడి.. ఐదుగురు మృతి

ఓ టెంపో ట్రాలీ లోయలో పడి ఐదుగురు చనిపోయిన విషాద ఘటన జమ్మూకశ్మీరులోని రాంబన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. రాంబన్ జిల్లాలో జమ్మూ నుంచి బనీహాల్ కు టెంపో ట్రాలీలో వెళుతుండగా ప్రమాదవశాత్తూ లోయలో పడింది. లోయలో పడే ముందు టెంపో ఓ కారును ఢీకొందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాద ఘటనలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement