Sunday, April 28, 2024

తెలంగాణలో బిజెపి అధికారంలోకి రానుందన్న ‘మోడీ’..

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణ రాజకీయాలపై ఆయన స్పందించారు. హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలు చూస్తే కేసీఆర్ క్రేజ్ తగ్గిందన్నారు. తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్‌లో బీజేపీకి 2వేల కంటే తక్కువ ఓట్లు రాగా.. తాజా ఉపఎన్నికలో లక్షకు పైగా ఓట్లు రావడమే దీనికి సంకేతమన్నారు. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని మోడీ అన్నారు. తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిందని గుర్తుచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటోందన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచామని, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటామని, తాజాగా హుజురాబాద్ సీటును గెలుచుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌కు.. బీజేపీనే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని ఈ ఫలితాలను బట్టే అర్థమవుతోందని నడ్డా వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement