Friday, April 26, 2024

వ్యాపార రంగానికి స్వర్గధామం తెలంగాణ: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెలంగాణ ప్రభుత్వం వ్యాపార సంస్థల ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 2014 నుండి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 18,000 కొత్త వ్యాపారాలు ప్రారంభమై 2.62 లక్షల కోట్ల పెట్టుబడులతో, 16 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించాయన్నారు. శ‌నివారం రాత్రి జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వైశ్య లైమ్ లైట్ అవార్డుల కార్యక్రమంలో కవిత మాట్లాడారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యాపారాలను ప్రోత్సహించడానికి అనేక సబ్పీడిలు, సౌకర్యాలు కల్పిస్తున్నార‌ని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు.

వివిధ వ్యాపార రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఎమ్మెల్సీ కవిత అవార్డులు అందజేశారు. వైశ్యులు సాంప్రదాయంగా చేసే వ్యాపారాలతో పాటు, పలు విభిన్న రంగాలు, సేవా కార్యాక్రమాల్లోనూ పాల్గొంటున్నారన్నారు, వారు మ‌రింత‌గా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్న‌ట్టు చెప్పారు. భారత్‌–చైనా సరిహద్దుల్లోని గాల్వన్‌ లోయలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగాన్ని గుర్తుచేసిన కవిత, సంతోష్ సతీమణికి అవార్డు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ దయానంద్, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement