Thursday, April 25, 2024

బొజ్జల లేనిలేటు తీరనిది.. నివాళులర్పించిన మంత్రి రామచంద్రారెడ్డి

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం చిత్తూరు జిల్లాకు తీరని లోటు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇవ్వాల రాత్రి బొజ్జల భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బొజ్జల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గోపాలకృష్ణారెడ్డి ఈ జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్​ నేత అని కొనియాడారు. అంతేకాకుండా మంత్రిగా జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన మృతి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి తీరని లోటుగా ఉంటుందన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్న మంత్రి రామచంద్రారెడ్డి తెలిపారు. కాగా, మంత్రి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి ఎంపి గురుమూర్తి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement