Friday, April 19, 2024

Flash: బీజేపీ ఎమ్మెల్యేలకు చుక్కెదురు.. సస్పెన్షన్‌‌పై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యేదాకా సభ నుంచి తమను సస్పెండ్‌ చేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఎం.రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌‌ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు తీర్పు వెలువరించింది. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

కాగా, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఈ నెల 7న బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తమను సభ నుంచి సస్పెండ్ చేశారని, ఆ ఉత్తర్వులను వెంటనే కొట్టేసి, తాము అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును కోరారు. సస్పెన్షన్ తీర్మానం, వీడియో రికార్డులు సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement