Friday, April 26, 2024

నేడు అసెంబ్లీలో మరో రెండు కీలక బిల్లులు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ నేడు ప్రారంభం కానున్నాయి. మైనార్టీల సంక్షేమం, పాతబస్తీలో అభివృద్ధి పనులపై శాసనసభలో ఇవాళ స్వల్పకాలిక చర్చ జరగనుంది. టౌటింగ్ బిల్లుతో పాటు జీఎస్టీ చట్టసవరణబిల్లుపై అసెంబ్లీలో చర్చిస్తారు. మండలిలో హరితహారంపై చర్చ చేపడతారు. శుక్రవారం అసెంబ్లీ ఆమోదించిన పంచాయతీరాజ్, గృహనిర్మాణసంస్థ, నల్సార్, ఉద్యానవన విశ్వవిద్యాలయం చట్టసవరణ బిల్లులపై మండలిలో చర్చకు చేపడతారు. దళితబంధు పథకం, హైదరాబాద్​లో చెరువుల సుందరీకరణ, ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం, హైదరాబాద్​లో దోమలు- ఈగల బెడద, రాష్ట్రంలో వంతెనల మంజూరు, షాద్​నగర్​కు ఐటీఐ తరలింపు అంశాలు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement