Monday, April 29, 2024

తెలంగాణలో 78,787 మందికి కరోనా పరీక్షలు.. పాజిటివ్ కేసులు ఎన్ని?

తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 78,787 కరోనా పరీక్షలు నిర్వహించగా, 325 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 424 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,57,119 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,47,185 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 6,065 యాక్టింగ్ కేసులు ఉన్నాయి. కరోనా మృతుల సంఖ్య 3,869కి పెరిగింది.

కాగా, తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 80 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 26, ఖమ్మం జిల్లాలో 24 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement