Friday, March 29, 2024

గుంటూరు జిల్లాలో దారుణం.. తల్లీకూతుళ్లు హత్య

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తల్లీకూతుళ్ల హత్య సంచలనం సృష్టించింది. నాగార్జుననగర్‌లో నివసించే పద్మావతి (55), ఆమె కుమార్తె ప్రత్యూష (25) దారుణ రీతిలో హత్యకు గురయ్యారు. కత్తితో నరికి చంపడంతో ఇల్లంతా రక్తపు మడుగులా మారిపోయింది. సమీప బంధువే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు. ఆస్తి పంపకాలే ఈ హత్యలకు కారణమని భావిస్తున్నారు.

కాగా పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా కీలక సమాచారం లభ్యమవుతుందని పోలీసులు భావిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: 20 గ్రామాల కోసమే రాజధాని ఉండాలా?: మంత్రి బొత్స సంచలన వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement